తెలంగాణలో మహిళల కోసం మరో కొత్త కార్యక్రమం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అందుకు సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.