సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో ఆధునిక బస్టాండు నిర్మించేందుకు టీజీఎస్ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. 1981లో నిర్మించిన ప్రస్తుత బస్టాండును కూల్చి కొత్తగా భవనం నిర్మించనున్నారు. అందుకు కోసం ఆర్టీసీ అధికారులు మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రోజూ సుమారు 80 బస్సులు, ఐదు వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కొత్తగా నిర్మించే బస్టాండులో సిబ్బందికి విశ్రాంతి గదులు కూడా కల్పించే అవకాశం ఉంది.