తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వే నివేదికల ప్రకారం రాష్ట్రంలో కోటికిపైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగకపోవడం, డూప్లికేట్, మ్యాపింగ్ జరగని ఓట్లు ఉండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు అన్కలెక్టబుల్ జాబితాలోకి చేరాయి. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుండగా.. తేడాలున్న ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఈసీ సూచించిన గుర్తింపు కార్డులు చూపించి మాత్రమే వీరు ఓటును నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.