Telangana IPS Officers Shifted Back To AP Cadre: తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంజనీకుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా, అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు. అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధుల్లో ఉన్నారు.