తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే పథకానికి రూ.200 కోట్లతో ఆమోదం లభించింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందనుంది. మరోవైపు.. సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. విద్య, సాగునీరు, పారిశ్రామిక విధానాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.