రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్న సాదాబైనామాల పరిష్కారాలు తాజాగా ప్రారంభం అయ్యాయి. గతంలోనే సాదాబైనామాలకు సంబంధించి గతంలో విధించిన నిబంధనలను సవరించడంతో తిరిగి వాటిని పరిష్కరించే ప్రక్రియ మొదలైంది. ఆర్డీఓ విచారణ అధికారిగా సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో తిరస్కరణకు గురైన సాదాబైనామా దరఖాస్తులకు కూడా తాజా ప్రక్రియలో పరిష్కారం చూపించనున్నారు.