తెలంగాణలో 81 గ్రామాలను రూ. 1,273 కోట్లతో సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా మార్చేందుకు రెడ్కో టెండర్లు పిలిచింది. ఇందులో రూ. 400 కోట్లు కేంద్రం, రూ. 873 కోట్లు రాష్ట్రం భరిస్తాయి. 16,840 వ్యవసాయ బోర్లు, 40,349 ఇళ్లకు సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తారు. రైతులు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అందించి యూనిట్కు రూ. 3.13 ఆదాయం పొందవచ్చు. ఈ పథకం విజయవంతమైతే.. గ్రామాల్లో కరెంట్ బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుంది.