తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రేవంత్ రెడ్డి సర్కార్ వినాయక చవితి సందర్భంగా శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించింది. ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా.. స్కూల్ అసిస్టెంట్లు హెడ్ మాస్టర్లుగా ప్రమోట్ అయ్యారు. పలువురు ఎస్జీటీలు కూడా హెడ్ మాస్టర్లుగా పదోన్నతి పొందారు. దాదాపు 4500 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.