తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు హాడావుడి మామూలుగా లేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ, వార్డు సభల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే.. కొన్ని సభల్లో మాత్రం స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న లిస్ట్ తుది జాబితా కాదని.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.