సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎన్ఎండీ ఫరూక్ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేదు. వేర్వేరు కారణాలతో వీరంతా సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం అందించినట్లు తెలిసింది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నట్లు తెలిసింది.