జనగాం జిల్లాకు చెందిన నర్మదా అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. పదాల ఉచ్చారణను సులభంగా నేర్పిస్తూ.. విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపనను పెంచుతున్నారు. ఆమె అంకితభావం ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతోంది.