Kurnool Man Found In Jammu Kashmir After Pahalgam Incident: జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఒక కుటుంబానికి సంతోషాన్నిచ్చింది. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కర్నూలు జిల్లాకు చెందిన బెస్త వీరేష్ అనే వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కాశ్మీర్లో ఆవులు మేపుతున్న వీరేష్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి అని గుర్తించారు. దీంతో ఏపీ పోలీసులు అప్రమత్తమై, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భర్త తిరిగి రావడంతో యల్లమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.