క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. విశాఖపట్నం వేదికగా జరగనున్న భారత్, శ్రీలంక మహిళల టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్లను తగ్గించారు. డిసెంబర్ 21, 23వ తేదీలలో విశాఖలో రెండు టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఎక్కువ మంది ప్రేక్షకులను గ్రౌండ్కు రప్పించాలనే ఉద్దేశంతో అధికారులు రేట్లు తగ్గించారు. రూ.200 నుంచి రూ.400 వరకూ టికెట్ రేట్లను నిర్ణయించారు. టికెట్ల విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు జనవరి 26న విశాఖలో భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్ జరగనుంది.