మక్తల్ పట్టణంలో రూ. 4 కోట్ల వ్యయంతో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మించనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. 40 ఏళ్ల నాటి పాత బస్టాండ్ శిథిలమవ్వడంతో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి భారీ ఆదాయం వస్తున్నా.. అధికారులు ప్రచారంలో వెనుకబడ్డారని మంత్రి మండిపడ్డారు. రాత్రి వేళల్లో మహిళల కోసం ఎక్స్ప్రెస్ బస్సులను కూడా లోకల్ స్టేజీల వద్ద ఆపాలని అధికారులను ఆదేశించారు.