సినిమా థియేటర్లలో టికెట్ల ధరల కంటే తినుబండారాల ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. కాకినాడలో ఆర్డీవో, ఎమ్మార్వోలు థియేటర్లలో సోదాలు నిర్వహించి నాణ్యత, ధరలను పరిశీలించారు. ఆహార పదార్థాల ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచారణ చేపట్టనున్నారు.