హైదరాబాద్లో సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏప్రిల్ 18న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.