దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. సంక్రాంతి పండుగ వేళ.. 124 స్పెషల్ ట్రైన్స్ ప్రకటన..

4 months ago 12
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఊరటనిస్తూ 400కు పైగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అందులో 124 రైళ్లను నెల రోజుల ముందే అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మార్గాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రత్యేక సేవలు జనవరి 24 వరకు కొనసాగుతాయి. ఈ రైళ్లలో అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సుమారు 30 లక్షల మంది ఈసారి రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని అంచనా.
Read Entire Article