జగిత్యాల జిల్లాలో దసరా పండుగ సందర్భంగా వెరైటీ ఆఫర్ ప్రకటించి.. వార్తల్లో నిలిచాడు సాయిని తిరుపతి అనే వ్యక్తి. దసరా పండుగ సందర్భంగా 'రూ.150 కొట్టు.. మేకను పట్టు' అంటూ లక్కీ డ్రా ప్రకటించాడు. మొదటి బహుమతిగా మేక, సెకండ్ ప్రైజ్గా బీర్ కేసు, మూడో బహుమతిగా విస్కీ బాటిల్, నాలుగో బహుమతిగా నాటుకోడి, ఐదో బహుమతిగా చీర ఇవ్వనున్నారు. అక్టోబర్ 1న డ్రా తీయనున్నారు. ఈ ఆఫర్ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.