దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. అలానే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలకు దుర్గమ్మ ఆలయం ముస్తాబవుతుంది. నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి 500 రూపాయల టికెట్ను రద్దు చేశారు. అలానే వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా అనేక మార్పులు చేశారు. ఒక రోజు వీఐపీ దర్శనాలు పూర్తి రద్దు చేశారు. అలానే పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. మూలా నక్షత్రం నాడు సీఎం దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.