దసరా పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజల కోసం కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు జారీ చేశారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నేరగాళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులకు సహకరించాలని కోరారు.