ఉద్యోగులకు సింగరేణి యాజమాన్యం గుడ్న్యూస్ చెప్పింది. దసరా పండగ సందర్భంగా.. ఉద్యోగులకు అడ్వాన్స్లు చెల్లించాలని నిర్ణయించుకుంది. రెగ్యులర్ సిబ్బందికి రూ.25 వేలు.. తాత్కాలిక ఉద్యోగులకు రూ.12,500 ముందస్తు చెల్లింపులు ఇవ్వాలని పేర్కొంది. పండగకు వారం రోజుల ముందే ఈ అడ్వాన్స్లను అందించనున్నట్లు వెల్లడించింది.