దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు దసరా అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆర్టీసీ రెడీ అవుతోంది. ఉద్యోగులు అడ్వాన్స్గా తీసుకునే ఈ మొత్తాన్ని 2025 నవంబర్ జీతం నుంచి పది సమాన వాయిదాలలో తిరిగి వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే దసరా పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. దీని గురించి పూర్తి వివరాలు..