సైబరాబాద్ SOT పోలీసులు గంజాయి సరఫరా చేస్తున్న వికాస్ సోహును అరెస్టు చేసి, రూ. 3.5 కోట్ల విలువైన నార్కోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ వాసి అయిన వికాస్, షాద్నగర్లోని ఓ దాబాలో పనిచేస్తూ గంజాయి విక్రయాలు మొదలుపెట్టాడు. యజమాని మరణానంతరం హెరాయిన్, ఓపియం, పాపీ స్ట్రా, గంజాయి కొనుగోలు చేసి విక్రయించగా, రూ. 89,700 నగదు లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. డ్రగ్స్ సమాచారం ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని సీపీ అవినాష్ మహంతి కోరారు, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు.