Cyclone Ditwah Andhra Pradesh Weather: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు, రేపు.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానున్న ఈ తుఫాన్.. తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.