దీపావళి తర్వాత హైదరాబాద్లో సదర్ ఉత్సవాలను యాదవులు ఘనంగా జరుపుకుంటారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకలకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈసారి ముషీరాబాద్లో జరిగిన వేడుకల్లో 'వస్తాద్ గుమాన్ కాళీ' అనే భారీ దున్నపోతు అందరినీ ఆకట్టుకుంది. దానికి యువకుడు రూ.31 వేల విలువైన విస్కీ తాగించాడు.