ఏపీని మొంథా తుపాను ఆందోళనకు గురిచేస్తోంది. కాకినాడ తీరంవైపుగా మొంథా తుపాను కదులుతోంది. మంగళవారం రాత్రికి కాకినాడ వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు సన్నాహక చర్యలు చేపట్టింది. మరోవైపు తుపానులు, భారీ వర్షాల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు సూచనలు చేసింది.