హిందూ దేవుళ్లను, పురాణాలను నీచంగా దూషిస్తూ, తీవ్రవాదాన్ని సమర్థించే రావణ్ లాంటి సంఘ విద్రోహ శక్తులకు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం అందిస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు. బనగానపల్లెలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతాన్ని, వైఎస్ కుటుంబ ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు.