బండి భగీరథ్కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైదరాబాద్ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో న్యాయస్థానం అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మే 16న అరెస్టయి గత 45 రోజులకు పైగా రిమాండ్లో ఉన్న భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన.. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలనే నిబంధనతో బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించారు.