Petrol Diesel Costliest In Andhra Pradesh: దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని కేంద్రమంత్రి సురేష్ గోపి రాజ్యసభలో వెల్లడించారు. అధిక వ్యాట్ వల్లే ఈ పరిస్థితి నెలకొందని, అమరావతిలో లీటరు పెట్రోలు రూ.109.74, డీజిల్ రూ.97.57గా ఉందని తెలిపారు. మరోవైపు, ఏపీ రైతులపై రూ.3.76 లక్షల కోట్ల వ్యవసాయ అప్పుల భారం ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్సభలో తెలిపారు.