ధరణి అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టిన ప్రభుత్వం.. ఆ నివేదికను విశ్లేషించింది మిగతా 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ చేయనుంది. అయితే ఈ సర్వే పూర్తయ్యాక రైతులకు భూధార్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతికతతో భూ సర్వేలు నిర్వహిస్తామని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.