తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధరణి, భూ భారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని మీసేవ నిర్వాహకులు, మధ్యవర్తులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ. 42 కోట్ల స్టాంప్ డ్యూటీ సొమ్మును అక్రమంగా మళ్లించారు. సీసీఎల్ఏ ఆడిట్ చేయగా.. 4,300 లావాదేవీల్లో నగదు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.