Botsa Satyanarayana On Vizianagaram Srimanu Utsavam Incident: వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపించారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిపోవడంపై కలెక్టర్, ఎస్పీల బాధ్యతను ప్రశ్నించారు. ఈ విషయంపై గవర్నర్, సీఎస్లకు లేఖ రాస్తానని తెలిపారు. అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించారని, ఆర్భాటం, అహంకారం తప్ప సాంప్రదాయాలకు తావివ్వలేదని విమర్శించారు. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.