బీజేపీ నేత, చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కొందరి వ్యవహార శైలి పట్ల.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే పార్టీ రాష్ట్ర కార్యదర్శికి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇచ్చి వినూత్నంగా తన నిరసనను బయటపెట్టారు. కార్యకర్తలతో పనిలేదని ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపగా.. తాజాగా ఆయన బహుమతిగా ఫుట్బాల్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనతో బీజేపీలో అంతర్గత పోరు మరోసారి వెలుగులోకి వచ్చింది.