హైదరాబాద్లో ఒక మహిళ తన వ్యాపార భాగస్వామి రామ్పటేల్ చేతిలో నకిలీ నోట్ల మోసానికి గురైంది. రామ్పటేల్ అత్యవసరంగా రూ.18.5 లక్షలు బ్యాంకులో జమ చేయాలని కోరగా.. మనీషా సావంత్ అతడి ఖాతాకు బదిలీ చేసింది. తిరిగి నగదు అడిగినప్పుడు.. రామ్పటేల్ నకిలీ నోట్లున్న బ్యాగును ఇచ్చి, ఆమెను కారుతో ఢీకొట్టి పారిపోయాడు. బాధితురాలు పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో రామ్పటేల్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.