భూ తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు మహిళలపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.