ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంత్రి వాకిటి శ్రీహరి కీలక భరోసా ఇచ్చారు. నిధులు అందవనే భయంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించకపోవటం సరైంది కాదన్నారు. అందరికీ డబ్బులు జమ అవుతాయని.. అవసరమైతే తన ఇళ్లు, ఆస్తులు అమ్మి అయినా సరే డబ్బులు చెల్లిస్తా అని హామీ ఇచ్చారు. రూ. 5 లక్షల సాయం నాలుగు విడతల్లో అందుతుందని.. త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు.