కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. తన కుమారుడి దుస్తులపై విమర్శలు చేసిన కేటీఆర్ స్థాయి తన కుమారుడి కంటే తక్కువని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు సైతం బీఆర్ఎస్ నేతల తీరును ఖండించారు. మీడియాకు రక్షణ కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.