Police Complaint On Visakhapatnam Actress Sowmya Shetty: నటి సౌమ్యశెట్టి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే వ్యక్తి, స్నేహం పేరుతో సోషల్ మీడియాలో పరిచయమైన సౌమ్యశెట్టి తనను రూ.86 లక్షలు మోసం చేసిందని విశాఖపట్నం సీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న సౌమ్యశెట్టిపై ఇప్పుడు కొత్త ఆరోపణలు వెల్లువెత్తాయి. సౌమ్య శెట్టి వ్యవహారంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు.