నా బిడ్డను చంపిన వాడిని కూడా చంపేయండి.. సహస్ర తల్లిదండ్రుల డిమాండ్

6 months ago 9
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసుకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడు మైనర్‌ అని చెప్పి అతడ్ని కఠినశిక్ష నుంచి తప్పించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాట్‌ కోసం వచ్చి చంపాడని చెప్పడం నిజం కాదని తెలిపారు. సహస్త్ర బంధువులు, స్థానికులతో కలిసి ఆమె తల్లిదండ్రులు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెను హత్య చేసిన బాలుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. హత్య చేసిన బాలుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలని తెలిపారు. దీంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు.. సహస్త్ర తల్లిదండ్రులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య పరామర్శించి.. బాలిక హత్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article