వైఎస్సార్ కడప జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో బయాలజీ టీచర్గా పనిచేస్తున్న జ్యోతి, ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. ప్రిన్సిపల్ నిర్మల తనను వేధిస్తోందని, ఆమె వల్లే తాను చనిపోవాలనుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. తోటి ఉపాధ్యాయులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రిన్సిపల్ నిర్మల మీద చర్యలు తీసుకోవాలని జ్యోతి కోరారు.