నా వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గురించి కాదు.. అందరికంటే ముందు మేమే చెప్పాం : టీటీడీ ఛైర్మన్

1 year ago 11
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. జరిగిన ఘటనలో తమ తప్పిదం లేకపోయినా కూడా శ్రీవారి భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే ఘటన జరిగిన రోజు కూడా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల కమిటీ కంటే ముందు తాము క్షమాపణలు కోరినట్లు గుర్తుచేశారు. తొక్కిసలాట ఘటనలో బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు టీటీడీ తరుఫున 25 లక్షల పరిహారం అందిస్తామన్నారు.
Read Entire Article