హైదరాబాద్ నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వాచ్మెన్ దంపతుల ఇద్దరు కుమారులు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు మృతి చెందారు. సెల్లార్ను గోదాంగా మార్చడం, నిబంధనలు పాటించకపోవడం ప్రమాదానికి కారణాలని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. యజమానిపై కేసు నమోదు చేశారు.