Mahabubabad Natu Kodi Incident: మహబూబాబాద్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి పెంచుకుంటున్న నాటు కోడి ట్రాక్టర్ కింద పడి చనిపోవడంతో, ఇసుక మాఫియాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏకంగా 11 మందిపై కేసు నమోదైంది. ప్రాణంగా చూసుకున్న కోడి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టేది లేదని.. ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదని బాధితుడు తేల్చి చెబుతుండటం గమనార్హం.