వరంగల్ జిల్లాకు చెందిన సురేందర్ అనే వ్యక్తి మానసిక ఒత్తిడితో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక అతని భార్య పద్మావతి కూడా అదే చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. దీంతో వారి ఐదేళ్ల కుమారుడు 'ఫ్లీజ్ మమ్మీ చచ్చిపోవద్దు' అంటూ వేడుకోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.