మాలల ఐక్యతా సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి తనపై జరుగుతున్న కుట్రలపై ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కులపరమైన విమర్శలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కొందరు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదని.. సేవ చేయడమే లక్ష్యమని వివేక్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు లక్ష్మణ్ వెంటనే స్పందిస్తూ.. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని.. తాను చర్చకు సిద్ధమని లక్ష్మణ్ సవాల్ విసిరారు.