నామినేషన్ సమయంలోనే రూ.8 కోట్లు ఖర్చు. అయినా ఓటరు దేవుళ్లు కనికరించలేదు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శమంత ఓటమి పాలయ్యారు. 19వ డివిజన్ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కాగా, నామినేషన్ వేసేందుకు నో డ్యూ సర్టిఫికేట్ అవసరం ఉండటంతో పాత పన్ను బకాయిలు రూ.8 కోట్లు చెల్లించి ఆమె వార్తల్లో నిలిచారు.