‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు

5 months ago 11
కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు గుప్పించారు. తనలాగే సాధారణ కుటుంబంలో జన్మించిన పెమ్మసాని.. చదువుకొని అమెరికా వెళ్లి డాక్టర్‌గా పని చేస్తూ.. ఐటీ కంపెనీ స్థాపించాడని.. బాగా డబ్బులు సంపాదించి, ఆ తర్వాత ప్రజా సేవ చేయడం కోసం స్వదేశానికి తిరిగొచ్చాడని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత ఎంపీగా సునాయాసంగా గెలిచి.. కేంద్ర మంత్రిగా జాక్‌పాట్ కొట్టాడన్నారు. ఇంత త్వరగా అందరికీ అవకాశాలు రావని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రైతులు డబ్బులు దుర్వినియోగం చేయొద్దని.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే అనుకున్న స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందన్నారు.
Read Entire Article