తెలంగాణలో రైతుల రుణమాఫీ నాలుగు విడతల్లో జరిగింది. దీనిలో చాలా మందికి రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరిగింది. అయితే తీసుకున్న రుణానికి అదనంగా వడ్డీ కలిపితే.. రూ.2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో యాసంగి సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో రైతులు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు.