భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఒక ఎన్నారై పెళ్లి వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భర్త నవీన్రెడ్డి తనను వేధిస్తున్నాడని.. తిరిగి అమెరికాకు తీసుకెళ్లడం లేదని భార్య దుబ్బాక శ్రావ్య ఆరోపించారు. సంతానం విషయంలో తనపై నిందలు వేసి వైద్య పరీక్షలు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఇల్లెందు సీఐ సత్యనారాయణను నవీన్రెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఐజీ సస్పెండ్ చేయడాన్ని శ్రావ్య తప్పుబట్టారు. పోలీసు ఉన్నతాధికారులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు.