అధిక వడ్డీ ఆశ చూపి జనాన్ని మోసం చేసిన ఆర్థిక నేరస్తుడిని పట్టుకోవాల్సిన పోలీసులే.. అతడి నుంచి రూ.2 కోట్లు తీసుకుని వదిలేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ నేరస్తుడి వద్ద రూ.2 కోట్లు తీసుకుని.. అతడిని వదిలేశాడు. పైగా నేరస్తుడితో కలిసి ఒకే కారులో ప్రయాణించి, డబ్బు తీసుకుని అతడిని పారిపోయేలా సహకరించాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఆ వివరాలు..